పల్లెటూళ్లలో బాత్రూమ్లు ఎలా ఉంటాయో పోలీసులకు తెలీదా? : ఎమ్మెల్సీ అశోక్బాబు
పల్లెటూళ్లలో బాత్రూమ్లు ఎలా ఉంటాయో పోలీసులకు తెలీదా అంటూ ప్రశ్నించారు టీడీపీ ఎమ్మెల్సీ అశోక్బాబు. మందడంలో డ్రోన్ కెమెరాతో చిత్రీకరణ చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. రాజధాని కోసం ఉద్యమిస్తున్న రైతులను, జేఏసీ నేతలను నేరగాళ్ల మాదిరి ట్రీట్ చేయడం దారుణమని ఆయన ఖండించారు. పోలీసులు ఇష్టమొచ్చినట్టు వ్యవహరిస్తే.. అంతకంత అనుభవిస్తారని అశోక్బాబు హెచ్చరించారు.