పేకమేడలా కూలిపోయిన మూడంతస్తుల భవనం

Update: 2020-02-21 20:43 GMT

చత్తీస్‌గఢ్‌ రాజధాని రాయ్‌పూర్‌లో ఓ మూడంతస్తుల భవనం ఉన్నట్టుండి కుప్పకూలింది. ఈ ఘటనలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. నగరంలోని ఖమత్‌రాయి‌ ప్రాంతంలో ఉన్న ఈ భవనం పక్కనే మరో బిల్డింగ్‌ నిర్మాణం జరుగుతోంది. పునాదుల కోసం లోతైన తవ్వకాలు జరపడంతో.. పక్కనే ఉన్న భవనం బలహీనపడింది. శుక్రవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా పేకమేడలా కూలిపోయింది. గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

 

Similar News