ప్రేమోన్మాది బాలాజీ సూసైడ్.. రైలు కిందపడి..

Update: 2020-02-23 15:48 GMT

గుంటూరు జిల్లాలో ప్రేమోన్మాది బాలాజీ సూసైడ్ చేసుకున్నాడు. బాపట్ల సమీపంలో రైలు కిందపడి చనిపోయాడు. నిన్న రేపల్లె మండలం నడింపల్లిలో.. రమాదేవి అనే మహిళపై కాల్పులు జరిపాడు బాలాజీ. రమాదేవి కూతురిని తనకు ఇచ్చి పెళ్లి చేయడం లేదన్న కారణంగానే ఆ కుటుంబంపై దాడికి దిగాడు. గతంలోనే తనపై వాళ్లు ఫిర్యాదు చేయడం, తాజాగా కాల్పుల కేసు కూడా నమోదవడంతో బాలాజీ ప్రాణాలు తీసుకోవాలని భావించాడు. రైలు కింద తల పెట్టి ప్రాణాలు వదిలాడు.

Similar News