భారత్లో మత స్వేచ్ఛను పరిరక్షించేందుకు మోదీ ప్రభుత్వం చిత్తశుద్దితో కృషిచేస్తోందన్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. సీఏఏకు వ్యతిరేకంగా జరుగుతున్న అల్లర్లపై జర్నలిస్టులు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. ప్రజలందరికీ మత స్వేచ్చ ఉండాలని మోదీ కోరుకుంటున్నారన్నారు. భారత్లో జరుగుతున్న కొన్ని ఘటనలు ఆ దేశ అంతర్గతమన్నారు ట్రంప్. సీఏఏ గురించి ప్రధాని మోదీతో తాను చర్చించలేదన్నారు.