హైదరాబాద్ ప్రశాంతంగా ఉందని.. వదంతులను ప్రజలు నమ్మవద్దన్నారు హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫేక్ వీడియోల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎలాంటి సమస్య ఉన్న 100కు ఫోన్ చేయాలని సూచించారు. హైదరాబాద్ పాతబస్తీ చార్మినార్ పరిసర ప్రాంతాల్లో ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించిన సీపీ అంజనీ కుమార్.. స్థానికుల నుంచి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.