విశాఖలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటనను అడ్డుకోవాలని మంత్రులు పిలుపునివ్వడం అప్రజాస్వామికమన్నారు ఏపీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి. మంత్రులు జగన్కు బానిసల్లా మారారని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్న మంత్రులను తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. సీఎం జగన్ కక్షపూరిత ధోరణితో వ్యవహరిస్తున్నారని తులసిరెడ్డి మండిపడ్డారు.