నిర్భయ దోషులకు అన్ని దారులు మూసుకుపోయాయి. పవన్ కుమార్ గుప్తా పెట్టుకున్న క్షమాబిక్ష పిటిషన్ ను రాష్ట్రపతి తిరస్కరించారు. దాంతో రేపు ఉదయం నలుగురు దోషులను ఉరి తీసే అవకాశం ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. అంతకుముందు పవన్ నివారణ పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఉరిశిక్షను జీవిత ఖైదుగా మార్చాలని ఆయన అభ్యర్థించారు. దీనికి జస్టిస్ ఎన్వి రమణ నేతృత్వంలోని 5 మంది న్యాయమూర్తుల ధర్మాసనం శిక్షను పునఃపరిశీలించే ప్రశ్న లేదని పిటిషన్ ను కొట్టివేశారు.