అశోక్ గజపతిరాజుకు తెలియజేయకుండా ఎలా నిర్ణయం తీసుకుంటారు: ఎమ్మెల్సీ మాధవ్

Update: 2020-03-06 15:15 GMT

సింహచలం దేవస్థానం ఛైర్మన్ విషయంలో వైసీపీ ప్రభుత్వం రాత్రికి రాత్రి జీవోలు ఇవ్వడంపై BJP MLC మాధవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అశోక్ గజపతిరాజుకు సమాచారం ఇవ్వకుండా.. సంచయితను ఛైర్‌పర్సన్‌గా నియమించడం సరికాదన్నారు. పైగా సంచయిత బీజేపీ అధికార ప్రతినిధిగా ఉన్నారని గుర్తు చేశారు. ఆమెను పదవి నుంచి తొలగించాలని హైకమాండ్‌కు లేఖ రాస్తున్నామన్నారు. దేవాలయ భూములపై అధికార పార్టీ నేతలు కన్నేశారని ఆరోపించారు.

Similar News