కోమటిరెడ్డి వ్యాఖ్యలపై మంత్రి ఎర్రబెల్లి కౌంటర్‌

Update: 2020-03-07 14:58 GMT

తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, మంత్రి ఎర్రబెల్లి మధ్య మాటల యుద్ధం నడిచింది. కేసీఆర్‌ ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రా? లేక ఒక ప్రాంతానికా? అని ప్రశ్నించిన రాజగోపాల్‌రెడ్డి.. కాళేశ్వరం మీద ఉన్న శ్రద్ధ పాలమూరుపై ఎందుకు లేదని ప్రశ్నించారు. కోమటిరెడ్డి వ్యాఖ్యలపై మంత్రి ఎర్రబెల్లి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. రాజగోపాల్‌ రెడ్డి గ్రామాల్లోకి వెళితే జనం ఉరికించి కొడతారంటూ కౌంటర్‌ ఇచ్చారు.

Similar News