ప్రజలు సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటారు : చంద్రబాబు

Update: 2020-03-07 18:54 GMT

వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో అరాచక పాలన సాగిస్తోందన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. టీడీపీ నాయకులపై బెదిరింపులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ట్రస్టుల విషయంలోనూ జోక్యం చేసుకుంటూ రాజకీయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీకాకుళం జిల్లాలో టీడీపీ నేత బాబ్జి కుటుంబాన్ని బెదిరిస్తున్నారని.. వైసీపీ నాయకుల బెదిరింపుల వల్లే అవినాష్‌ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడని ఆవేదన వ్యక్త చేశారు. రాష్ట్రం అభద్రతా భావంతో వుందని.. ప్రజలు సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటారని అన్నారు.

Similar News