ఏపీలో నియంత పాలన కొనసాగుతోంది: కళా వెంకట్రావ్

Update: 2020-03-12 17:33 GMT

ఏపీలో నియంత పాలన కొనసాగుతోందని మాజీ మంత్రి కళా వెంకట్రావ్‌ ఆరోపించారు. ఎవరైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే వారిపై కేసులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీస్‌ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసిన ఘనత ఈ ప్రభుత్వానిదే అన్నారు. డ్యూటీలో ఉన్న ఒక సీఐ పై అధికార పార్టీకి చెందిన మహిళ దాడి చేయడం దారుణమన్నారు. టీడీపీ నేతలు బుద్ధా వెంకన్న, బొండా ఉమలపై నడిరోడ్డుపైనే దాడి చేశారంటే.. సామాన్యుడి పరిస్థితి ఏంటని ప్రశ్నించారు.

Similar News