పల్లెప్రగతిలో అనేక లోపాలున్నాయన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత భట్టి విక్రమార్క. పంచాయీతీలకు ట్రాక్టర్, ట్యాంకర్ ఇచ్చారని అయితే.. వాటి నిర్వహణ భారంగా మారిందన్నారు. గ్రామాలకు కేవలం కేంద్రం గ్రాంట్లే ఇస్తున్నారు తప్ప.. రాష్ట్రం ఎలాంటి సహాయం చేయడం లేదన్నారు.