వైసీపీ దాడిలో తీవ్రంగా గాయపడిన అడ్వకేట్ కిషోర్ను పరామర్శించిన చంద్రబాబు
మాచర్లలో వైసీపీ కార్యకర్తల దాడిలో తీవ్రంగా గాయపడిన అడ్వకేట్ కిషోర్ను పరామర్శించారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఆయన ఆరోగ్యపరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. తలపై బలమైన గాయమైందని.. ఇంకాస్త గట్టిగా తగిలితే కన్నుపోయేది అన్నారు చంద్రబాబు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోందంటూ మండిపడ్డారు.