ప్రపంచ వ్యాప్తంగా విజృంభిస్తున్న కరోనా వైరస్ పట్ల ప్రభుత్వం అప్రమత్తమైనట్లు అసెంబ్లీలో ప్రకటించారు సీఎం కేసీఆర్. కొవిడ్-19 కట్టడికి ముందు జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. అటు కాంగ్రెస్ ఎమ్మెల్యే భట్టి విక్రమార్కపై నిప్పులు చెరిగారు కేసీఆర్. ఈ దేశానికి పట్టిన భయంకరమైన కరోనా వైరస్.. కాంగ్రెస్సే అని విమర్శించారు.