రాష్ట్రంలో పరిస్థితులు దుర్మార్గంగా ఉన్నాయన్నారు టీడీపీ నేత, మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి. రాష్ట్ర ఎన్నికల కమిషన్ను కలిసిన జేసీ.. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ దారుణంగా ఉందన్నారు. ఎలాగో అలా.. నామినేషన్లు వేశాం.. ఇక ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడాలన్నారు. ఎన్నికలు ప్రస్తుత పరిస్థితిని కమిషనర్కు వివరించామన్నారు. పోలింగ్లో సీసీ కెమారాలు ఏర్పాటు చేయాలని ఎన్నికల కమిషన్ను కోరామన్నారు జేసీ.