అమరావతి ఉద్యమాన్ని అణిచివేయాలని ప్రభుత్వం దిగజారి ప్రవర్తిస్తోందని రాజధాని రైతులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. చిన్న పిల్లలను కూడా పోలీసులు బెదిరిస్తున్నారని ఆరోపించారు. అమరావతే రాజధానిగా ఉంటుందని జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేసే వరకు ఉద్యమం కొనసాగిస్తామని రైతులు తేల్చి చెప్పారు.