ఏపీలో మూడు రాజధానుల నిర్ణయంపై సీఎం జగన్ మోహన్ రెడ్డి సొంత జిల్లాలోనే వ్యతిరేకత వస్తోంది. తుళ్లూరులో రాజధాని రైతుల ఉద్యమానికి కడప జిల్లా రైతులు మద్దతు తెలిపారు. దీక్షా శిబిరంలో కూర్చుని సంఘీభావం ప్రకటించారు. సీఎం జగన్ ప్రకటనపై సిగ్గు పడుతున్నామంటూ ఘాటుగా స్పందించారు. YSR పాలనకు, జగన్ తీరుకు పొంతనే లేదన్నారు. అమరావతి రైతులకు తాము క్షమాపణ చెప్తున్నామని అన్నారు.