తిరుమలలోని పాపవినాశానంకు వెళ్లే రహదారిలో ఏనుగుల గుంపు హల్చల్ చేశాయి. వేణుగోపాలస్వామి ఆలయం , ఆకాశ గంగ మధ్య గల అటవీ ప్రాంతం నుంచి రోడ్డు దాటుతున్న సమయంలో నాలుగు ఏనుగులు వాహనదారుల కంటపడ్డాయి. దీంతో వాహనదారులు బెంబేలెత్తిపోయారు. శ్రీగంధం వనంలో ప్రవేశించిన ఏనుగుల గుంపు అక్కడ ఉన్న నీటి పైపులను , చెట్లను నాశం చేశాయి. సమాచారం అందుకున్న అటవీ అధికారులు గన్లు, టపాసులు ఉపయోగించి ఏనుగుల గుంపును అటవీ ప్రాంతంలోనికి తరిమేశారు.