కరోనా వైరస్ నేపథ్యంలో అనంతపురం జిల్లాలో అధికారులు అలర్టయ్యారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పుట్టపర్తికి దేశ, విదేశాల నుంచి నిత్యం భక్తులు వస్తుంటారు. దీంతోపాటు అంతర్జాతీయ కియా కార్ల పరిశ్రమలో పనిచేసేందుకు ఇతర దేశస్తులు తరుచూ వస్తూ.. పోతూ ఉంటంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది.