కరోనా ప్రభావంతో తిరుమల శ్రీవారి దర్శనాలను తాత్కాలికంగా నిలిపివేశారు. ప్రతి రోజు దాదాపు 50 వేల మంది దర్శించుకునే ఆలయం కావటంతో వైరస్ వ్యాప్తి చెందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీంతో ముందస్తు చర్యల్లో భాగంగా వారం పాటు ఆలయంలోకి భక్తులను అనుమతించ కూడదని నిర్ణయించారు. ఈ వారం రోజుల పాటు స్వామివారికి నిర్వహించే కైంకర్యాలన్ని ఏకాంతంగా నిర్వహిస్తామని టీటీడీ వెల్లడించింది.