కరోనా ప్రభావంతో దేశ రాజధాని ఢిల్లీ వణికిపోతోంది. స్కూళ్లు, కాలేజీలు, షాపింగ్ మాల్స్, థియేటర్లు మూసివేయడంతో వ్యాపార రంగంపై తీవ్ర ప్రభావం పడుతోంది. రెండు వారాలుగా ఫారెన్ టూరిస్టులు పెద్దగా లేకపోవడంతో గిరాకీ పడిపోయి.. దుకాణాలు వెలవెలబోతున్నాయి. షాపుల్లోకి వచ్చే వారు సైతం అనుమానంగానే కనిపిస్తున్నారంటూ సేల్స్ బాయ్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.