జనతా కర్ఫ్యూకి పూర్తి మద్దతుగా రాజధాని అమరావతివాసులు

Update: 2020-03-22 11:44 GMT

రాజధాని అమరావతివాసులు జనతా కర్ఫ్యూకి పూర్తి మద్దతుగా నిలిచారు. ఉద్యమానికి విరామం ప్రకటించాల్సి రావడం లాంటి సంకట స్థితి ఎదురైనా ప్రస్తుత పరిస్థితుల్లో కరోనాపై పోరాటమే ముఖ్యమంటున్నారు. ఇవాళ 96వ రోజుకు ఉద్యమం చేరింది. ఈ నేపథ్యంలో ఉదయం ఐదున్నర నుంచి 7 గంటల వరకూ దీక్షల్లో కూర్చున్నారు. తర్వాత ఇళ్లకు వెళ్లిపోయారు. రాత్రి 9 గంటల తర్వాత జనతా కర్ఫ్యూ ముగిసాక అంతా దీక్షా శిబిరాలకు వచ్చి కాసేపు అమరావతి కోసం ఆందోళన చేపడతారు.

Similar News