కరోనా విషయంలో భారత్పై డబ్యూహెచ్ఓ ప్రశంసలు కురిపించింది. కరోనాను కట్టడి చేసే శక్తి సామర్థ్యాలు భారత్కు ఉన్నాయని ధీమా వ్యక్తం చేసింది. భారత్ గతంలో అత్యంత ప్రమాదకరమైన మశూచి, పోలియో వంటి వ్యాధులను ధీటుగా ఎదుర్కొందని కితాబిచ్చిన ప్రపంచ ఆరోగ్య సంస్థ.. అదే అనుభవంతో ఈ మహమ్మారిని కూడా ఎదుర్కొంటుందని విశ్వాసం వ్యక్తం చేసింది. వైద్య రంగంలో వైరస్లను తరిమికొట్టడంలో భారత్కు ప్రత్యేక స్థానం ఉందని తెలిపింది.