తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. తాజాగా మరో రెండు పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇందులో సౌదీ నుంచి వచ్చిన మూడేళ్ల చిన్నారి, 43 ఏళ్ల మహిళ ఉన్నారు. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 41 కి చేరింది. తెలంగాణలో ఇప్పటివరకు నమోదైన 41 కేసుల్లో మూడేళ్ల చిన్నారికి కరోనా పాజిటివ్ కేసు నమోదు కావడం ఇదే మొట్టమొదటిది.