శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళిలో కానిస్టెబుల్పై తండ్రి కొడుకులు తిరబడ్డారు. బైక్ వెళ్లుతున్న వీరిద్దరిని కానిస్టెబుల్ జీవరత్నం అడ్డుకున్నాడు. బైక్పై ఇద్దరూ వెళ్లకూడదంటూ వారిని అడ్డుకున్నాడు. దీంతో.. అతనితో వాగ్వాదానికి దిగారు తండ్రికొడుకులు. కానిస్టెబుల్పై ఏకంగా.. రాళ్లు, కర్రతో దాడి చేశారు తండ్రికొడుకులు. ఈ దాడిలో కానిస్టెబుల్ జీవరత్నం తీవ్రంగా గాయపడ్డాడు. అతన్ని కోటబొమ్మాళ్లి పీహెచ్సీకి తరలించారు. ఈ దాడికి పాల్పడిన తండ్రికొడుకులు.. పరిశురాంపురం గ్రామస్థులుగా గుర్తించారు పోలీసులు. ప్రస్తుతం తండ్రిని అదుపులో తీసుకున్నారు. కొడుకు మాత్రం పరారీలో ఉన్నట్లు తెలిపారు పోలీసులు.