విజయనగరంలో చిక్కుకుపోయిన ఉత్తరప్రదేశ్ యువకులు

Update: 2020-03-28 14:30 GMT

దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌తో ఉత్తరప్రదేశ్‌కు చెందిన 17 మంది యువకులు విజయనగరం జిల్లా బొబ్బిలిలో చిక్కుకున్నారు. వ్యాపారాలు సాగక, ఆకలి బాధలు తట్టుకోలేక అల్లాడుతున్నారు. స్వరాష్ట్రానికి వెల్లేందుకు ట్రైన్స్‌, బస్సులు కూడా లేకపోవడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చేసేది లేక కాలినడకన ఉత్తరప్రదేశ్‌కు బయల్దేరారు. వీరంతా వస్త్రాలు విక్రయించేందుకు నాలుగు నెలల క్రితం బొబ్బికి వచ్చి చిక్కుకుపోయారు.

Similar News