కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోంది. ఇక ఈ వైరస్ ఇటలీని అతాలకుతలం చేస్తుంది. ఇటలీలో కరోనా మృతుల సంఖ్య రోజురోజుకి పెరుగుతుంది. గత 24 గంటల వ్యవధిలోనే ఆ దేశంలో 756 మంది కరోనా రోగులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇటలీలో కరోనా బారినపడి మరణించిన వారి సంఖ్య ఇప్పటి వరకు 10వేలకు పైగా చేరింది. మరణాలతో పాటు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య కూడా ఇటలీలో శరవేగంగా పెరుగుతున్నది. ఆదివారం ఒక్కరోజే అక్కడ కొత్తగా 3,815 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.