కరోనావైరస్ నుండి వచ్చే ఆర్థిక సంక్షోభాన్ని ఎలా ఎదుర్కోవాలో అర్ధం కాక తీవ్ర ఆందోళన చెందుతున్న జర్మనీకి చెందిన హెస్సీ రాష్ట్ర ఆర్థిక మంత్రి థామస్ షెఫర్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ విషయాన్నీ హెస్సీ రాష్ట్ర గవర్నర్ వోల్కర్ బౌఫియర్ ఆదివారం తెలిపారు.
మిస్టర్ షాఫెర్ (54) శనివారం రైల్వే ట్రాక్ సమీపంలో చనిపోయి పడివున్నాడు.. ఆయన ఆత్మహత్య చేసుకొని మరణించాడని వారు నమ్ముతున్నారని వైస్బాడెన్ ప్రాసిక్యూషన్ కార్యాలయం తెలిపింది.
ఆయన చనిపోయారన్న విషయం మమ్మల్ని షాక్ కు గురిచేసింది.. ఈ కష్ట సమయంలో ఖచ్చితంగా ఆయనే మాకు అవసరమయ్యేది అతనే ఆత్మహత్య చేసుకోవడం చాలా బాధ కలిగిస్తోంది.. అని మిస్టర్ బౌఫియర్ రికార్డ్ చేసిన ప్రకటనలో తెలిపారు.