ఏపీలో ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలను రెండు విడతల్లో చెల్లిస్తామని ఏపీ రాష్ట్ర ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ తెలిపారు. సీఎం జగన్ తో జరిగిన భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కరోనా ప్రభావం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై పడిందని.. అందుకే ఈ నెలలో సగం వేతనం చెల్లిస్తామని, నిధులు సమకూరిన తరువాత మిగతా సగం చెల్లిస్తామని సీఎం చెప్పారని ఆయన చెప్పారు. ఈ ఆపత్కాల పరిస్థితిలో రెండు విడతలుగా జీతం తీసుకునేందుకు ఒప్పుకున్నామని సూర్యనారాయణ పేర్కొన్నారు. ఈ ఒక్క నెల మాత్రమే రెండు విడతల్లో చెల్లిస్తామని సీఎం చెప్పారన్నారు.