కరోనాపై పోరాటానికి కోటి రూపాయలు విరాళం ప్రకటించిన బండి సంజయ్‌

Update: 2020-04-03 19:45 GMT

కరోనాపై పోరాటానికి కరోనాపై తెలంగాణ బీజీపీ అధ్యక్షుడు, కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ తన నియోజకవర్గ నిధుల నుంచి రూ.కోటి పీఎం విరాళంగా ప్రకటించారు. దీంతో పాటు ఒక నెల వేతనాన్ని కూడా ఇస్తున్నట్టు ప్రకటించారు. కరోనా నివారణ చర్యల్లో భాగంగా ఇప్పటికే కరీంనగర్‌ లోక్‌సభ నియోజకవర్గానికి రూ.50 లక్షలను కేటాయించినట్లు పేర్కొన్నారు. ‘కరోనా మహమ్మారిని తరిమేద్దాం-దేశాన్ని గెలిపిద్దాం’ అంటూ పీఎం కేర్స్‌ సహాయ నిధికి విరాళాలు అందించాలని తాను ఇచ్చిన పిలుపు మేరకు భారీ ఎత్తున స్పందన వచ్చిందని ఒక ప్రకటన ద్వారా తెలిపారు.

Similar News