ఏప్రిల్ 8, 9 తేదీల్లో ముస్లింలు ఇళ్లలోనుంచి బయటకు రావద్దని ఢిల్లీ పోలీసులు కోరారు. ఈ రెండు రోజుల్లో.. షబ్బే బరాత్ జాగ్నేకీ రాత్ సందర్భంగా ముస్లింలు ఇళ్లలోనుంచి బయటకు రావద్దని అన్నారు. యువకులు బైక్ లపై వీధుల్లోకి రాకుండా ఇళ్లలోనే ఉండాలని సూచించారు. కరోనా లాక్డౌన్ సందర్భంగా ఎవరైనా ముస్లింలు బయటకు వస్తే అలాంటి వారిపై చట్ట ప్రకార చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. ముస్లిమ్ మత నాయకులు లాక్ డౌన్ కు సహకరించాలని.. ఇళ్లలోనే సురక్షితంగా ఉండాలని ఢిల్లీ పోలీసులు పోస్టర్లతో ప్రచారం చేపట్టారు.