కశ్మీర్‌లో ఎదురు కాల్పులు.. సైన్యం చేతిలో 9 మంది ఉగ్రవాదులు హతం

Update: 2020-04-05 13:55 GMT

నియంత్రణ రేఖ దగ్గర భారత్ లోకి చొచ్చుకొచ్చేందుకు ప్రయత్నించిన 9 మంది ఉగ్రవాదులని భారత్ సైన్యం మట్టుబెట్టింది. వారిలో నలుగురు దక్షిణ కశ్మీర్‌లోని బత్పురాలో శనివారం సైన్యం చేతుల్లో హతమయ్యారు. మరో ఐదుగురు కెరాన్ సెక్టార్‌లోని నియంత్రణ రేఖ వద్ద భారత భూభాగంలోకి చొచ్చుకు వచ్చేందుకు యత్నిస్తుండగా సైన్యం మట్టుబెట్టారు. అయితే.. ఎదురుకాల్పుల్లో ఓ సైనికుడు అమరుడయ్యారు. మరో ఇద్దరు సైనికులు గాయపడ్డారు.

Similar News