కామారెడ్డి జిల్లా లింగంపేట మండలంలో అగ్నిప్రమాదం సంభవించింది. ఆదివారం రాత్రి ముస్తాపూర్ తండాలో స్థానికులు దీపాలను వెలిగిస్తుండగా అనుకోకుండా మంటలు ఎగిసి పడ్డాయి. దీంతో రెండు గుడిసెలకు నిప్పంటుకుని కాలిబూడిదయ్యాయి. ప్రధాని మోదీ పిలుపు మేరకు కరోనాకు వ్యతిరేకంగా దీపాలను వెలిగిస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.