విద్యార్థులను తప్పుదోవ పట్టించే వార్తలు రోజుకొకటి వస్తున్నాయి. ఏదైనా బోర్డు వెబ్సైట్లో చూసి మాత్రమే నిర్ణయించుకోండి అని తల్లిదండ్రులను విద్యార్థులను ఉద్దేశించి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ తెలిపింది. అసత్య వార్తలను ప్రసారం చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని ప్రకటించింది. పరీక్షలకు సంబంధించిన ఎలాంటి సందేహాలున్న అధికారిక వెబ్సైట్ లేదా, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, ఫేస్బుక్లలో చూసుకొని నిర్ధారించుకోమంటూ సిబీఎస్ఈ కార్యదర్శి అనురాగ్ త్రిపాఠి తెలిపారు.