కరోనా వైరస్ బారిన పడి జానపద గాయకుడు, పాటల రచయిత కూడా అయిన జాన్ ప్రిన్ (73) మరణించారు. గత కొద్ది రోజులుగా ఆయన శ్వాస కోశ వ్యాధితో బాధపడుతూ మార్చి 26న నాష్విల్లెలోని ఆసుపత్రిలో చేరారు. కానీ అప్పటికే పరిస్థితి విషమించడంతో ఆయన కన్నుమూశారు. అత్యంత ప్రతిభావంతమైన గేయ రచయితలలో ప్రిన్ ఒకరని రికార్డింగ్ అకాడమీ ఒక ప్రకటనలో తెలిపింది. ఆయన ఆత్మకు శాంతి కలగాలని తెలియజేశారు.