కరోనా మహమ్మారిపై పోరాటంలో కేంద్ర ప్రభుత్వానికి అండగా.. పీఎం కేర్స్ ఫండ్కు ఓలా కంపెనీ భారీ విరాళం అందించింది. రాష్ట్ర ప్రభుత్వాలకు, కేంద్ర సాయంగా పలు సంస్ధలు, వ్యక్తులు తోచిన సాయం అందిస్తూ సంఘీభావం ప్రకటిస్తుండగా.. ఈ క్రమంలోనే ప్రముఖ టాక్సీ కంపెనీ ఓలా తమ వంతు సాయం అందజేసింది.
కరోనా మహమ్మారిపై నిరంతర పోరాటానికి ప్రభుత్వం చేస్తున్న సేవలు కొనియాడదగినవని, ఈ క్రమంలో పీఎం కేర్స్ ఫండ్కు రూ .5 కోట్లు, వివిధ రాష్ట్ర ప్రభుత్వాలకు రూ. 3 కోట్లు విరాళం అందచేస్తున్నామని ఓలా గ్రూప్ సహ వ్యవస్ధాపకుడు, సీఈవో భవిష్ అగర్వాల్ ఓ ప్రకటనలో వెల్లడించారు.