నేడు ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ సమావేశం

Update: 2020-04-11 09:16 GMT

ప్రస్తుతం కరోనావైరస్ వ్యాప్తి, దీని కట్టడికి విధించిన దేశవ్యాప్త లాక్‌డౌన్‌ను ఏప్రిల్‌ 14వ తేదీన తరువాత ఎత్తివేయాలా? వద్దా? అన్నదానిపై ప్రధాని నరేంద్ర మోదీ శనివారం అన్ని రాష్ట్రాల రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సంప్రదింపులు జరపనున్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా లాక్‌డౌన్‌పై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. లాక్ డౌన్ పై బుధవారం అఖిలపక్ష సమావేశంలో ప్రధాని కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే శనివారం మోదీ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ముఖ్యమంత్రుల సలహా, సూచనలను తీసుకోనున్నారు. సాయంత్రంలోపు లాక్ డౌన్ పై కీలక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

Similar News