ఢిల్లీలో భూ ప్రకంపనలు

Update: 2020-04-12 20:07 GMT

దేశ రాజధాని ఢిల్లీలో భూ ప్రకంపనలు ఒక్కసారిగా భయాందోళనలకు గురి చేశాయి. తూర్పు ఢిల్లీ కేంద్రంగా ఆదివారం సాయంత్రం 5.45 గంటలకు ఈ భూకంపం సంభవించినట్లు ఉన్నట్లుగా గుర్తించారు. రిక్టార్ స్కేల్‌పై భూ ప్రకంపనలు 3.5గా నమోదైనట్లు భారత వాతావరణ శాఖ వెల్లడించింది. అయితే ఈ భూ ప్రకంపనలు కొద్ది క్షణాల పాటే సంభవించాయని.. ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని తెలిపారు. అయితే ఒక్కసారిగా సంభవించిన భూప్రకంపనలతో ఢిల్లీ ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.

Similar News