పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ ఆదేశాలను కూడా పక్కన పెట్టి కొందరు భక్తులు స్వర్ణ దేవాలయానికి చేరుకున్నారు. సోమవారం బైసాఖి పర్వదినం సందర్భంగా అమృత్సర్లోని స్వర్ణ దేవాలయానికి లాక్ డౌన్ నియమాలను ఉల్లంఘిస్తూ కొంతమంది భక్తులు వచ్చారు. సీఎం అమరీందర్ సింగ్ ప్రజలు తమ ఇళ్లలోనే ఉండి పండుగను జరుపుకోవాలని విజ్ఞప్తి చేసినప్పటికీ వీరు లెక్కచేయలేదు. పంజాబ్లో ఇప్పటివరకు కారానా పాజిటివ్ కేసులు సంఖ్య 132 కు చేరింది. ఈ వ్యాధి కారణంగా రాష్ట్రంలో ఇప్పటివరకు 11 మంది మరణించారు.