సీఎం జగన్ మరో కీలక నిర్ణయం.. క్వారంటైన్ పూర్తి చేసుకున్న వాళ్ళకు రూ.2వేలు
క్వారంటైన్ పూర్తి చేసుకుని వెళ్లేవాళ్లకు రూ.2వేలు ఇవ్వాలని సీఎం జగన్ అధికారులకి సూచించారు. కరోనా నివారణ చర్యలపై సమీక్ష నిర్వహించైనా ఆయన ఈ మేరకు ఆదేశించారు. క్వారంటైన్ కేంద్రాల్లో సదుపాయాలపై ఎలా ఉన్నాయనే దానిపై అధికారులని అడిగి తెలుసుకున్నారు. బాధితులకు డబుల్, సింగిల్ రూమ్ ఇస్తున్నామని అధికారులు తెలిపారు. క్వారంటైన్ పూర్తి చేసుకుని వెళ్లేవాళ్లకు రూ.2వేలు ఇచ్చి.. పంపించాలని అన్నారు. ఇంటికి వెళ్లిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలను గురించి వారికి సూచించాలని.. ప్రతి వారం వచ్చి పరీక్షలు చేయించుకునేలా చూడాలన్నారు.
అటు రైతులను ఆదుకునేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నూనెల ధరలపై దృష్టి పెట్టాలని, ధరలు పెరగకుండా చూడాలని జగన్ చెప్పారు.