ఏపీలో 525 కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు

Update: 2020-04-15 23:29 GMT

ఏపీ కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. రోజు రోజుకి కరోనా బాధితుల సంఖ్య పెరుగుతుంది. బుధవారం ఒక్కరోజే 23 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు ప్రభుత్వం ప్రకటించింది. బుధవారం ఉదయం 9 గంటల నుంచి రాత్రి 7 గంటల మధ్య ఏపీలో కరోనా బారిన పడి ముగ్గురు మృతి చెందినట్లు ప్రభుత్వం తెలిపింది. దీంతో.. ఏపీలో కరోనా మృతుల సంఖ్య 14కు చేరింది. ఇప్పటివరకూ ఏపీలో 525 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

Similar News