ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉద్యోగాల భర్తీ.. 1,184 డాక్టర్ పోస్టులకు..

Update: 2020-04-17 18:46 GMT

కరోనా ఎఫెక్ట్‌తో ఆసుపత్రులు ఖాళీలేవు.. డాక్టర్లు, నర్సులు 24 గంటలూ డ్యూటీ చేస్తున్నారు. అయినా రోగుల సంఖ్య కుప్పలు తెప్పలుగా పెరుగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏడాది ఒప్పంద ప్రాతిపదికన 1,184 వైద్యుల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నెల 19 లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 592 జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్లు, 192 అనస్తీషియా స్పెషలిస్టులు, 400 జనరల్, పల్మనరీ మెడిసిన్ పోస్టులను భర్తీ చేయనున్నామని ఏపీ ప్రభుత్వం తెలిపింది.

Similar News