ఏపీలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకి పెరుగుతున్నాయి. ఏపీలో ఈ మహమ్మారి మరొకరి ప్రాణాలను తీసింది. శనివారం కరోనా వైరస్ కారణంగా కర్నూలు జిల్లాలో ఒకరు మృతి చెందారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా కరోనా మరణాల సంఖ్య 16కు చేరింది. కాగా జిల్లాలో కరోనా కారణంగా ఇప్పటి వరకూ ముగ్గురు మృతిచెందినట్లు అధికారులు తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా పాజిటివ్ బాధితుల సంఖ్య 603కి చేరింది.