ఢిల్లీ లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. కరోనా కేసులు రోజురోజుకి పెరుగుతున్నాయి. తాజాగా ఢిల్లీలో ఇద్దరు పోలీస్ కానిస్టేబుళ్లకు పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో ఇద్దరు కానిస్టేబుళ్లతో సన్నిహితంగా ఉన్న పీఎస్ స్టేషన్ హౌజ్ ఆఫీసర్ సహా 26 మందిని క్వారంటైన్ చేశామని అధికారులు వెల్లడించారు. ఢిల్లీలో ఇప్పటివరకు మొత్తం 1640 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా బారిన పడి 38 మంది ప్రాణాలు కోల్పోయారు.