కరోనాపై మానవత్వం విజయం సాధిస్తుందని ప్రధాని మోదీ అన్నారు. ఈ మేరకు శనివారం ట్వీట్ చేసైనా మోడీ లాక్డౌన్ నేపథ్యంలో పలు మంత్రిత్వశాఖలు చేస్తున్న కృషిని ఆయన ప్రశంసించారు. ‘‘ఐకమత్యంతో ప్రపంచం మొత్తం కరోనాపై పోరాటం చేస్తోంది. కరోనాపై మానవత్వం విజయం సాధిస్తుంది’’ అని ట్వీట్ ఆయన ట్వీట్ చేశారు.
అటు.. పలు మంత్రిత్వశాఖల గురించి ప్రస్తావిస్తూ ప్రశంసించారు. ‘‘భారత రైల్వేలను చూసి గర్వముగా ఉంది. ఈ క్లిష్ట సమయంలో ప్రజలకు నిత్యం సేవ చేస్తూనే ఉన్నారు.’’ అని మోదీ ట్వీట్లో పేర్కొన్నారు.