తమిళనాడులో కరోనా మహమ్మారి వేగంగా వ్యాపిస్తోంది. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతుంది. ఆదివారం కొత్తగా 105 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు కేసుల సంఖ్య 1477కు చేరింది. తమిళనాడులో కరోనాతో ఇప్పటివరకు 15 మంది మృతి చెందారని వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది.