ప్రపంచమంతా కరోనా వైరస్తో వణికిపోతుంటే.. జపాన్ మాత్రం భూకంపలతో అతలాకుతలమవుతోంది. సోమవారం జపాన్ లో భారీ భూకంపం వచ్చింది. మియాగీ ప్రాంతంలో భూకంపం చోటుచేసుకుందని అధికారులు వెల్లడించారు. ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.1 గా నమోదైందని ప్రకటించారు. అయితే ఈ భూకంపంవల్ల ఎలాంటి ప్రాణ నష్టం జరుగలేదని అధికారులు స్పష్టంచేశారు.