భారత్‌ను భయపెడుతున్న కరోనా.. 24 గంటల్లో 47మృతులు

Update: 2020-04-21 15:06 GMT

కరోనా కట్టడికి భారత్‌లో దాదాపుగా నెల రోజుల నుంచి లాక్డౌన్ కొనసాగుతుంది. అయినప్పటికీ కేసుల సంఖ్య పెరుగుతుండడం కొంత ఆందోళన కలిగిస్తోంది. గడచిన 24 గంటల్లో 1,336 కొత్త కేసులు వెలుగు చూశాయి. దీంతో ఇప్పటి వరకు వైరస్ సోకిన వారి సంఖ్య 18,601కి చేరుకుంది. 24 గంటల్లో మరణించిన వారి సంఖ్య 47 నమోదు కావడంతో మరణాల సంఖ్య 590కి చేరింది. ఇక వీటితో పాటు రికవరీ సంఖ్య కూడా పెరగడం కొంత ఊరటనిచ్చే అంశం. ఇప్పటి వరకు చికిత్స అనంతరం కోలుకుని ఇళ్లకు చేరిన వారి సంఖ్య 3251గా నమోదైంది. దేశం మొత్తంలో వైరస్ బారిన పడుతున్న వారు మహారాష్ట్రలో ఎక్కువగా ఉన్నారు. ఆ తరువాతి స్థానంలో ఢిల్లీ, గుజరాత్, రాజస్తాన్, తమిళనాడు, మధ్య ప్రదేశ్ ఉన్నాయి.

Similar News