లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాకు లండన్ హైకోర్టులో ఎదురు దెబ్బతగిలింది. తనను భారత్ కు అప్పగించవద్దని మాల్యా దాఖలు చేసిన పిటిషన్ను లండన్ హైకోర్టు కొట్టివేసింది. భారత బ్యాంకులకు 9 వేల కోట్ల రూపాయలు ఎగ్గొట్టి ఇంగ్లాండ్కు పారిపోయిన మాల్యాకు ఇదో పెద్ద షాక్ అనే చెప్పొచ్చు. దీంతో మాల్యాను స్వదేశానికి తీసుకొని వచ్చెనందుకు భారత్ చేస్తున్న ప్రయత్నాలలో మరికొన్ని అడ్డంకులు తొలగినట్టే. వేలకోట్లు భారత బ్యాంకులకు ఎగ్గొట్టి బ్రిటన్ పారిపోయిన సంగతి తెలిసిందే. దీనికి గాను భారత ప్రభుత్వం మాల్యాను స్వాదేశానికి తీసుకు వచ్చేందుకు తీవ్రంగా కృషి చేస్తుంది.