దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి తన ప్రతాపాన్ని చూపిస్తోంది. దీంతో దేశంలో రోజు రోజుకి కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. ఈ కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేఫథ్యంలో ఈ సంవత్సరం అమర్నాథ్ యాత్రను రద్దు చేస్తున్నట్లు అమర్నాథ్ బోర్డు ప్రకటించింది. గత ఏడాది జమ్ము కశ్మీర్కు ప్రత్యేక హోదాను కల్పించే ఆర్టికల్ 370 రద్దుతో అమర్నాథ్ యాత్ర నుంచి యాత్రికులు తమ పర్యటనను కుదించుకుని వెననుతిరిగారు. కాగా, కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఈ ఏడాది యాత్రను రద్దు చేస్తున్నట్టు అమర్నాథ్ బోర్డు బుధవారం వెల్లడించింది.